మృతురాలి కుటుంబానికి సాయం అందించిన ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన నేత సారమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న తస్లీమా శుక్రవారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,చిత్ర పటానికి పూలతో నివార్పించారు. ఆమె మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు,తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు, తదితరులు ఉన్నారు.