కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
రాజంపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భత్యాల మాట్లాడుతూ టీడీపీ పార్టీ ని వీడుతూ మేడా టీడీపీని గంజాయి వనంతో, వైసీపీని తులసీ వనంతో పోల్చారు. టీడీపీ ఎమ్మెల్యే గా మేడా 870 కోట్ల నిధులు ఖర్చు చేశారని, వైసీపీ ఎమ్మెల్యే గా తులసి తీర్థమంత అభివృద్ధి కూడా చేయలేదని ఎద్దేవాచేశారు.
టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గం అభివృద్ధికి 870 కోట్లు ఇచ్చారని, 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఎంత నిధులు మంజూరు అయ్యాయి, ఎంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గాంధీ బొమ్మ వద్ద ఎమ్మెల్యే రాజంపేట అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని, టైమ్, ప్లేస్ ఆయన చెప్పినా పర్వాలేదని అన్నారు.