అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని కొమ్మూరు, కొనాపురం గ్రామాల్లో ఆదివారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
డప్పువాయిద్యాలతో ,బాణాసంచా కాలుస్తూ,పులా జల్లు కురిపిస్తూ భత్యాలకు గ్రామంలో ఘాన స్వాగతం పలికారు.ప్రతి ఇంటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పై మహిళలతో సరదా సరదాగా సెటైర్లు వేశారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.