ఖమ్మం లోని 24వ డివిజన్ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొని వితరణ చేశారు.
తమ మొక్కులు చెల్లించడానికి వచ్చిన భక్తులకు శ్రావణ మాసం, బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షులు భీమనపల్లి ఉపేందర్, షేక్ తాజుద్దీన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు షేక్ రెహమాన్, డివిజన్ సెక్రెటరీ గోలి రామారావు, వైస్ ప్రెసిడెంట్ వీరన్న మరియు డివిజన్ నాయకులు కోటి, చందు, అస్లామ్, శ్రీనివాస్, మహిళా నాయకురాలు గంజి నాగలక్ష్మి డివిజన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.