తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భముగా హుజూర్ నగర్ లోని ప్రధాన సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా హుజుర్ నగర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తండు సాయి రామ్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని, అమరవీరుల ఆశయాల కోసం మనమందరం కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా సహదేవ రావు, హుజూర్ నగర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రెక్కల శభిరెడ్డి, చింతలపాలెం మండలం పార్టీ అధ్యక్షుడు తిరుమలగిరి గోవిందు, గొట్టి రాము, ఆవులపాటి శ్రీను, బెల్లంకొండ రామజోగి, యస్ కె చిన్న సైదా, నల్లమాద శ్రీనివాస్ యాదవ్, గార్లపాటి శ్రీనివాస్, ఇంటిమళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.