ఈ నెల 17న ఉత్తరాంధ్ర లో అదీ విజయనగరం జిల్లాలో జరిగిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన విజయవంతం అవ్వడాన్ని చూసి ఓర్వలేక నే జిల్లా కు చెందిన ఎమ్మెల్యే లు పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చీపురు పల్లికి చెందిన నాగార్జున అన్నారు. స్థానిక అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు.
గతంలో కిమిడి మృణాళిని మంత్రి గా చేసిన సమయంలో ఒక్క అవినీతి జరగలేదని అదే విధంగా అవినీతి మచ్చ పడలేదని కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం..సీనియర్ మంత్రి గారు నాలుగు శాఖల కు చూసి న బొత్స ఎంతమేరకు అవినీతికి పాల్పడ్డారో..మేము చెప్పక్కర్లేదని.. పలు కంపెనీలు చెబుతున్నాయన్నారు.ఉత్తరాంధ్ర లో టీడీపీ మళ్ళీ బలం పుంజుకుంటోందని తెలిసే…వైకాపా నేతలు చంద్రబాబు పై బురదజల్లు డానికి కంకణం కట్టు కున్నారన్నారు.
రాబోయే అదే 2024లో టీడీపీ రావడం ఖా యం…బాధ్యత బాబు సీఎం అవ్వడం తద్యమని నాగార్జున ధీమా వ్యక్తం చేసారు.వోక్స్ వేగాన్ కంపెనీ ఎవ్వరి వల్ల వెనక్కి వెళ్లిపోయింది…గృహనిర్మాణ శాఖలో ఎంతమేర అవినీతి జరిగింది.. భారీ పరిశ్రమ లు..ఎన్నొచ్చాయి…? ఈ ప్రశ్నలకు మంత్రి బోత్స సమాధానం చెబితే..అప్పుడు బాధ్యత బాబు నుద్దేశించి మాట్లాడొచ్చని నాగార్జున అన్నారు