28.7 C
Hyderabad
April 26, 2024 08: 36 AM
Slider హైదరాబాద్

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

#medical camp

ఉచిత శిబిరాలతో పేదలకు సేవ చేయడం  అభినందనీయమనీ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్  సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో త్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్  సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులుగా స్థానిక  కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉచిత  మెడికల్ శిబిరాల వల్ల బస్తీలలోని ప్రజల  ఆరోగ్య స్థితిగతులు తెలుస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జమ్మిగడ్డ వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ కోరారు.

ఈ  కార్యక్రమం వైద్యులు. ఎస్ డి ఎస్ రాజు, టి. ప్రగతి  ఆధ్వర్యంలో  త్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాగారం  ప్రైవేట్ ఆస్పత్రి సహకారంతో వైద్య శిబిరాన్ని  బి జె ఆర్ కాలనీలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, షేక్ అబ్దుల్ రహీం, గగన్ కుమార్, నరసింహచారి, లక్ష్మీనారాయణ, శేఖర్, నరేందర్, సింగం రాజు, లక్ష్మీనరసయ్య, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టండి: సిఐటియు

Satyam NEWS

డోన్ట్ కేర్: వైసిపి వారికి ఇది వార్త కాదు

Satyam NEWS

వెన్నెల రేడు

Satyam NEWS

Leave a Comment