ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఆపద్భాంధవుడు లాగా ఆదుకుంటుందని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.
సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఈ రోజు పంపిణీ చేశారు. వారిలో: P.మంగమ్మ w/o P.ఎల్లయ్య – రూ.11,000/.(గంగ భవాని కాలనీ – కొల్లాపూర్), K.శివుడు s/o K.కృష్ణయ్య౼రూ 40,000.(జవాయిపల్లి – కొల్లాపూర్), P.సరిత w/o P.నిరంజన్ – రూ.56,500/-. (కల్వకోల్ – పెద్దకొత్తపల్లి) ఉన్నారు.