34.7 C
Hyderabad
May 5, 2024 01: 43 AM
Slider ముఖ్యంశాలు

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

#TDPLeaderPattabhi

నిన్న మాజీ ఎంపి సబ్బం హరి ఇంటిని కూలగొట్టారు. నేడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు వచ్చి తన కారు అద్దాలు ధ్వంసం చేశారని పట్టాభి తెలిపారు.

తన ఇంటి వెనుకనే హైకోర్టు న్యాయమూర్తి ఉంటారని, ఆయన ఇంటి వద్ద పోలీసు పికెట్ ఉంటుందని అలాంటి చోటనే ఇలాంటి సంఘటన జరిగిందని పట్టాభి తెలిపారు.

పోలీసులు ఉండే ప్రదేశంలోనే తన కారుపై దాడి జరగడం గమనించాల్సిన విషయమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తున్నందువల్లే తన కారుపై దాడి చేశారని పట్టాభి తెలిపారు.

అయితే తాను ఇలాంటి దాడులకు భయపడేది లేదని పట్టాభి స్పష్టం చేశారు. మరింత పట్టుదలతో ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు.

Related posts

వేడెక్కిన రాష్ట్రం

Bhavani

25వరకు పలు రైళ్లు రద్దు

Bhavani

విశాఖ బీజేపీ నేత పి విష్ణు కుమార్ రాజు హౌస్ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment