రాష్ట్రం వేడెక్కింది. ఎండలు ముదరడంతో మధ్యాహ్నం బయటికి రావడానికి జనం జంకుతున్నారు. మంగళవారం నిర్మల్, భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉడికిపోయాయి. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలపైనే నమోదయ్యాయి.
మొత్తంగా 14 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా ఒకట్రెండు డిగ్రీలు తక్కువగానే ఉంటున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.