కిందపడ్డాడు. కాలు విరిగింది. నడవలేకపోతున్నాడు…. అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు హిమాన్షు.
తెలంగాణ ముఖ్యమంత్రి మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షు ప్రమాదవశాత్తూ ఇంట్లో కాలు జారి పడ్డాడని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
అలా కింద పడ్డ హిమాన్షు నడవలేకపోతున్నాడని, యశోదా ఆసుపత్రికిలో చేర్చారని కూడా వార్తలు వెలువడ్డాయి.
వీటన్నింటికి సమాధానంగా హిమాన్షు నేడు ఒక వీడియో విడుదల చేశాడు.
గుర్రపు స్వారీ కోసం వెళుతున్న వీడియో అది. అందులో హిమాన్షు బాగానే నడుస్తూ వెళుతున్నాడు. గుర్రాన్ని నడిపిస్తున్నాడు కూడా.