ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో టీడీపీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇన్నాళ్లు నిశబ్దంగా ఉన్న టీడీపీ నాయకులు కారంపూడి మండలంలో రాత్రి రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించి మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించి ముందంజలో
ఉండటంతో ఈసారి ఎలాగైనా టీడీపీ పుంజుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మండలంలో ఒక సామాజిక వర్గం పై కన్నేసింది అని విశ్వసనీయ సమాచారం. ఇటీవల పల్నాడు ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఒక కమిటీగా ఏర్పడి రానున్న ఎన్నికల్లో బ్రహ్మ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలతో
మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అధికారం ఉన్న ఆ సామాజికవర్గానికి కారంపూడి మండలంలో ఎటువంటి ప్రాముఖ్యత అధికార పార్టీ ఇవ్వలేదన్న విమర్శలు కూడా ఆ సామాజిక వర్గం నుండి మండలంలో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులతో కూడా టీడీపీ నాయకులు మంతనాలు జరిపినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ సామాజిక వర్గానికి మంచి ప్రాముఖ్యత
ఉంటుందని అందుకోసం ఈసారి బ్రహ్మరెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది యువకులు వైసీపీ నేతలతో జరిగే చర్చలలో వారికీ వివరిస్తున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా కారంపూడి మండలానికి చెందిన కొంతమంది ఆ సామాజికవర్గ వైసీపీ నాయకులతో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బ్రహ్మరెడ్డి కూడా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.