పోలీసుల అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు విశాఖపట్నం నోవాటెల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ పొలీసులు అక్రమ కేసులు నమోదు చేసి పార్టీ నాయకులతో పాటు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలను అదుపులోకి తీసుకున్న అంశాలపై సమీక్షించారు. అరెస్టయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, స్టేషన్లలో ఉన్నవారికి అవసరం అయిన మెడికల్ ఎయిడ్, ఆహారం సక్రమంగా అందించే బాధ్యతను తీసుకోవాలని నాయకులకి సూచించారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సహాయం అందించే బాధ్యతను పార్టీ చేపట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీనియర్ లాయర్లతో చర్చించామని చెప్పారు.
previous post