30.7 C
Hyderabad
May 5, 2024 04: 20 AM
Slider గుంటూరు

మాదకద్రవ్యాల కేసులో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు

#drug case

తరచూ సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ఒక యువకుడిని పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టీడీపీ సానుభూతిపరుడు అజయ్ అమృత్ ను నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.

అజయ్ వద్ద 5.100 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేసు పూర్వాపరాలు విచారించారు.

సంబంధం లేని కేసులో ఇరికించారని పోలీసుల పై డా౹౹చదలవాడ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన అజయ్ అమృత్ పై వైసీపీ కక్ష సాధిస్తున్నదని ఆయన అన్నారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

స్వేచ్ఛ‌గా, పార‌ద‌ర్శ‌కంగా మున్సిపల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తాం

Satyam NEWS

జాతీయ అవార్డు గ్రహీత జ్యోత్స్న కు ఎంపీ నామ  అభినందన

Murali Krishna

ఏపీ లో కూడా సెక్రటేరియేట్ కు వాస్తు మార్పులు

Satyam NEWS

Leave a Comment