తరచూ సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ఒక యువకుడిని పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేశారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టీడీపీ సానుభూతిపరుడు అజయ్ అమృత్ ను నరసరావుపేట రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
అజయ్ వద్ద 5.100 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేసు పూర్వాపరాలు విచారించారు.
సంబంధం లేని కేసులో ఇరికించారని పోలీసుల పై డా౹౹చదలవాడ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన అజయ్ అమృత్ పై వైసీపీ కక్ష సాధిస్తున్నదని ఆయన అన్నారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.