వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, ప్రస్తుతం బిఆర్ ఎస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి లేదని ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. 1956 కంటే ముందు వాల్మీకులు ఎస్టీ జాబితో ఉన్నారని,8 యేండ్ల నుండి వాల్మీకిలను మోసాగిస్తున్న పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి పూర్తి సహకారం ఉంటుందన్నారు. చల్లప్ప కమిషన్, ఆధారంగా క్యాబినెట్ ఆమోదంతో కేంద్రనికి పంపే బాధ్యత బి ఆర్ ఎస్ పార్టీ తీసుకోవాలన్నారు. కేంద్రం దగ్గర నుండి సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం తీసుకొంటే నేటికీ రాష్ట్రం నుండి ఎస్టీ జాబితా నివేదికను పంపలేదని అన్నారు.