28.7 C
Hyderabad
April 28, 2024 06: 15 AM
Slider ఖమ్మం

జాతీయ అవార్డు గ్రహీత జ్యోత్స్న కు ఎంపీ నామ  అభినందన

#nama

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ సాధు జ్యోత్స్న చేసిన సామాజిక సేవా  కార్యక్రమాలను గుర్తించి ఢిల్లీలోని భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ వారు “నేషనల్ విరంగన సావిత్రి బాయ్ పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు 2022 ” ను అందజేశారు. ఈ సందర్భంగా  ఢిల్లీలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎంపీ ని మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఎంపీ నామ , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలసి సాధు జ్యోత్స్న ను   శాలువా కప్పి సన్మానించి,  అభినందించారు. కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, వైరా మండల పార్టీ అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, గుళ్లపూడి హరికృష్ణ, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, దుద్దుకూరి రాజా, గొడ్డేటీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశవ్యాప్తంగా సెప్టెంబరు 15 నుంచి కొత్త విద్యాసంవత్సరం

Satyam NEWS

మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా పదవులకు పనికిరారు

Satyam NEWS

కొల్లాపూర్ లో విచ్చలవిడిగా ‘‘మినరల్ వాటర్ మాఫియా’’

Satyam NEWS

Leave a Comment