తెలుగదేశం పార్టీ సీనియర్ నాయకుడు నీరుకొండ సతీష్బాబు నేతృత్వంలో ఏఎస్రావునగర్ చెందిన పలువురు పార్టీ నాయకులు బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టి ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి గిడ్డి పద్మావతి , మాజీ శాసన సభ్యురాలు సీతదయాకర్రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని సుహాసిని పేర్కొన్నట్లు వారు తెలిపారు. ఆమెను కలిసిన వారిలో టిఎస్టియుసి మల్కాజిగిరి కోశాదికారి పసల ప్రసాద్ ,మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సాయి నాగార్జున తదితరలు ఉన్నారు.