తరిగొప్పుల మండల కేంద్రము లోని గొల్లకుంట కాలనీలో అబ్కారీ శాఖ అధికారి డి.శరత్ కుమార్ తన సిబ్బంది గుడుంబా స్థావరాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 80 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకంను ధ్వంసం చేశారు. దానితో పాటు 2 లీటర్లా గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా భూక్యా శంకర్ అనే గుడుంబా తయారీ దారుడు ఉన్నాడని కనుగొని వెతకగా అతను పరారయ్యాడు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు అబ్కారి శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో ఆబ్కారీ శాఖ ఎస్సై శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రవిప్రసాద్, ఈసీ రాజ్కుమార్, ఈసీ.ఏ రవీందర్ పాల్గొన్నారు.
previous post