39.2 C
Hyderabad
May 3, 2024 13: 44 PM
Slider ముఖ్యంశాలు

తీన్మార్ మల్లన్న పాదయాత్రను విజయవంతం చేయాలి

#teenmar Mallanna

తీన్మార్ మల్లన్న పాదయాత్రను విజయవంతం చేయాలని మల్లన్న టీం  రాష్ట్ర కోఆర్డినేటర్ దాసరి భూమయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉపాధ్యాయుల భవన్ లో  మల్లన్న ములుగు జిల్లా ఇంచార్జ్ అర్జునుడి కిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు

ఈ సమావేశానికి హాజరైన మల్లన్న టీం రాష్ట్ర కోఆర్డినేటర్ & రిటైర్డ్ సి ఐ  దాసరి భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యుధ్ధం మిగిలే ఉందని. ఆగస్టు నెలలో లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే “తీన్మార్ మల్లన్న పాదయాత్ర ను విజయవంతం  చేయాలని అన్నారు. 

రాష్ట్రంలో  కేసీఆర్ నయవంచన పాలనను, అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గొంతుకై ముందుకు నడవాలని టీం సభ్యులకు సూచి0చారు. అలాగే జిల్లా,నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు వేసి ప్రజా సమస్యలపై గొంతెత్తాలని, అండగా లీగల్ టీం,క్యూ న్యూస్ ఉంటుందని తెలియజేశారు.

అగస్టు లో మల్లన్న నిర్వహించబోయే పాదయాత్రను విజయవంతం చేసె దిశగా ప్రతీ ఒక్కరూ ముందుండాలని కోరారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్గనైజర్ చింతపండు వెంకటేశ్, రాష్ట్ర లీగల్ టీం సభ్యులు చందు,మార్త శ్రీనువాస్, మామిడి ప్రభాకర్, భుర్రి దేవేందర్,మొగుళ్ల భద్రయ్య, ముంజల బిక్షపతి, మురళి,రాజ్ కుమార్,విజయ్, సందీప్, ప్రాంజల్,అరుణ్, అనిల్,వెంకటేష్,వివిధ మండలాల టీం సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నేతల వత్తిడితోనే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు

Bhavani

రూల్సు పాటించని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కఠిన చర్యలు

Satyam NEWS

Operation PFI: ఎంతో పకడ్బందిగా ప్లాన్…హ్యాట్సాఫ్ NIA

Satyam NEWS

Leave a Comment