బిచ్కుంద మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు .లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో 8.30నిమిషాలకు అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వెంకటరావు, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అశోక్ పటేల్ ,మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం నాగరాజు,గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీరేఖ రాజు జెండా ఆవిష్కరణ జరిపారు.
మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సంధి సాయవ్వ సాయిరామ్ ,పోలీస్ స్టేషన్లో ఎస్సై కృష్ణ ,వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎడిఎ ఆంజనేయులు ,సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ బాలాజీ ,తెరాస కార్యాలయంలో అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి జెండా ఆవిష్కరణ చేశారు.
అదే విధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రభుత్వేతర పాఠశాలలలో పాఠశాలల యాజమాన్యం ఆయా గ్రామాల్లోని ఆయా గ్రామాల సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బిచ్కుందలో జరిగిన ఉత్సవాలలో ఎంపిపితో పాటు జడ్పిటిసి భారతి రాజు ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ ,ఎంపిడిఓ ఆనంద్. ఎంపీటీసీలు గంగామణి చంద్రకళ రాజు పాల్గొన్నారు.
ఇంకా ధన్సింగ్ శాంతబాయి, అవరి సురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు షేక్ పాషా సెట్, హజీ లక్ష్మణ్, బొమ్మల లక్ష్మణ్, ఖతుగామ మాజీ సర్పంచ్ హనుమాన్లు తెరాస శ్రేణులు, ఎంపీఒ మెహబూబ్ బిచుకుంద పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.