హుజూర్ నగర్ లోని ప్రధాన కూడలి వద్ద ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్థానిక పాత్రికేయులు, శ్రద్ధాంజలి ఘటించి, జోహార్లు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ సకల జనుల సమ్మె, సాగరహారం వంట, వార్పు,రైల్ రోకో జాతీయ రహదారుల దిగ్భంధం,ఛలో ట్యాంక్ బండ్, ప్రతి ఉద్యమ ఘటన, పోరాట సంఘటన పల్లె పల్లెకు చేర్చిన అక్షర కార్మికులకు తెలంగాణ ప్రభుత్వంలో సముచిత న్యాయం జరగాలి.
జర్నలిస్టుల కుటుంబాలకు గురించి ఆలోచన చేయాలి అన్నారు. కలం కార్మికుల ఉద్యమాభివందనాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యుజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, దేనుమకొండ శేషంరాజు నక్కా నరేష్ గౌడ్,పండ్ల నాగరాజు, కీతా రామనాథం, మహేష్, చిట్టి పోతుల రమేష్,పిల్లల మర్రి శ్రీనివాసు,దేవరం వెంకటరెడ్డి,రామకృష్ణ,కమతం నాగార్జున,బత్తిని శోభన్ బాబు,వెంపటి శ్రీనివాస్,నాగేందర్, ఆర్పీ గౌడ్, శ్రీనివాస్, వర్మ తదితరులు పాల్గొన్నారు.