Slider చిత్తూరు

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

#karikalavalan

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ ప్రసాదాలు  అందించి ,వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయం వెలుపల కరికాలవలవన్ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో  భక్తులకు ఇప్పటికే  మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు, అధికారుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

Related posts

విజయనగర,పైడితల్లి ఉత్సవాల బందోబస్తు పై ఎస్పీ దృష్టి

Satyam NEWS

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ కారుపై దాడి

Satyam NEWS

అనూష హత్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరా

Satyam NEWS

Leave a Comment