రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందించి ,వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కరికాలవలవన్ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు, అధికారుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
previous post