తెలంగాణ జాగృతి మహిళా నియోజకవర్గ కన్వీనర్ బోధ లక్ష్మి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణ జాగృతి మహిళా కన్వీనర్ గా షేక్.రహీమా ను నియమిస్తూ నియామక ఉత్తర్వు జారీ చేశారు.
ఈ నియామక ఉత్తర్వు పత్రాన్ని జాగృతి రాష్ట్ర నాయకుడు K.L.N.రావు షేక్.రహీమాకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న జాగృతి సంస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు.
షేక్.రహీమా మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ జాగృతి మహిళా కన్వీనర్ గా నియమించినందుకు, ఇందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విధిని సక్రమంగా నిర్వహిస్తూ జాగృతి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కోనుగంటి సత్యనారాయణ రెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బోధ లక్ష్మి, ధరావత్ జైత్రం నాయక్, నిమిషకవి పద్మ, జానీ మియా తదితరులు పాల్గొన్నారు.