ఇటీవల మరణించిన సామాజికవేత్త తుడుం దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబకట్ల నర్సింగరావు కుటుంబాన్ని నేడు ములుగు జిల్లా జాగృతి అధ్యక్షులు డాక్టర్ పొరిక రవిందర్ పరామర్శించారు.
రాయనిగుడం గ్రామంలో నివశిస్తున్న ఆయన భార్య ను కలిసి కొంత నగదు అందచేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోని వైద్య పరంగా ఎల్లప్పుడూ సహాయం చేస్తామని రవిందర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయనిగుడం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు.