31.2 C
Hyderabad
May 3, 2024 00: 32 AM
Slider జాతీయం

సొంత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న మీడియా

#KKVenugopal1

న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులపై కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యథేచ్ఛగా వ్యాఖ్యానాలు చేయడంపై అటార్నీ జరనరల్ కె కె వేణుగోపాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులపై వ్యాఖ్యానాలు చేయరాదనే నిబంధన ను మీడియా ప్రతినిధులు చాలా సందర్భాలలో ఉల్లంఘిస్తున్నారని ఇది వాంఛనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రశాంత్ భూషన్ కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా పెండింగ్ లో ఉన్న కేసులపై వ్యాఖ్యానాలు చేయడం వల్ల సమాజం, తద్వారా న్యాయమూర్తులు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇలా ప్రభావితం చేసే వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని ఆయన సూచించారు.

Related posts

వ్యధాభరిత జీవనం

Satyam NEWS

విజయనగరం కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం….!

Satyam NEWS

అమృతమే

Satyam NEWS

Leave a Comment