32.2 C
Hyderabad
May 2, 2024 00: 53 AM
Slider విజయనగరం

పాతిక కేజీల బియ్యం కాదు…పాతికేళ్ల‌ యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీ

#janasenaparty

జనసేన పార్టీ సిద్ధాంతాలతో ఉన్న పార్టీ అని,పవన్ కళ్యాణ్ ఆశయం నుండి పుట్టిన పార్టీ జనసేన  అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి అన్నారు. ఈ మేర‌కు  విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో  ఎస్పీ బంగ్లా వ‌ద్ద  ఉన్న‌ జనసేన పార్టీ కార్యాలయంలో  పార్టీ సిద్ధాంతాలతో కూడిన‌ 2022వ నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయంతో, కొన్ని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఓ కొత్తఓరవడిని సృష్టించేందుకు పార్టీని స్థాపించారన్నారు. పాతిక కేజీల బియ్యం కోసం కాదని,పాతిక సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు.

రాష్ట్రంలో ఏపార్టీకి సిద్ధాంతాలు లేవని, సిద్ధాంతాలతో కూడియున్న ఒకేఒక పార్టీ జనసేన అని అన్నారు. అనంతరం ఈనెల 9,10వ తేదీల్లో ఉత్తరాంధ్రలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసేందుకు విశాఖపట్నంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో విజయనగరం, నెలిమర్ల, ఎస్.కోట,చీపురుపల్లి నియోజకవర్గ నాయకుల తో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతీఒక్కరూ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలను,పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.కాగా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎస్.కోట నియజకవర్గం, దెందూరు గ్రామస్తులు పదిమంది యశస్వి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ఎస్.కోట, నెల్లిమర్ల,చీపురుపల్లి,విజయనగరం నియోజకవర్గ ముఖ్య నాయకులు భారీగా హాజరయ్యారు.

Related posts

టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

Bhavani

కొల్లాపూర్ లో అధికారి సంతకం ఫోర్జరీ: అయినా పోలీస్ కేసు లేదు

Satyam NEWS

కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment