38.2 C
Hyderabad
May 3, 2024 21: 08 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు

#telanganajanasamiti

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తెలంగాణ జన సమితి నియోజకవర్గం ఇంచార్జీ దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలంగాణ జన సమితి 7 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ 9 ఏళ్ల పాలనలో అవినీతి కుటుంబం,నిరంకుశ, విద్వేష పాలన చేస్తూన్నారని,బడా తోడు దొంగలైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులను ఓడించాలని తెలంగాణ జన సమితి నియోజకవర్గ కమిటీ తీర్మానించిందని,కాలేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల పేరిట కెసిఆర్ కుటుంబం అడ్డు అదుపులేని అవినీతికి పాల్పడిందని అన్నారు.

అంతులేని సొంత ఆస్తులను కూడా పెట్టుకొని నేడు రాష్ట్ర పరిపాలన కెసిఆర్ కుటుంబం కబంధ హస్తాలలో ఉందని అన్నారు.ఒక దుర్మార్గమైన ధన,భూస్వామ్య నియంతృత్వ దొరల పాలనను కెసిఆర్ కొనసాగిస్తున్నారని,ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య,వైద్యం నాశనమైందని,విద్య,వైద్యం ఖర్చులతో ప్రజల సమస్త ఆస్తులు గుల్ల అయిపోతుంటే,విద్య వైద్యంలో కార్పొరేటర్లు ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.మత విద్వేష పాపిస్టు నియంతృత్వ పాలనతో ఉన్న బిజెపి అభ్యర్థులను ఓడించాలని తీర్మానం చేశామని దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మోడీ,కేసిఆర్ లు దేశ,రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న తోడు దొంగలను ఓడించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని,ఈనెల 30న,జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తంకుమార్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి పార్టీ కోరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ పాలకీడు మండలం అధ్యక్షుడు ధీరావత్ చందు నాయక్, మల్లారెడ్డి గూడెం అధ్యక్షులు గొంగడి వెంకటరెడ్డి,మేళ్ళచెరువు అధ్యక్షుడు భూక్యా మురళి నాయక్,హుజూర్ నగర్ మండల అధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి,పట్టణ అధ్యక్షురాలు పుష్ప,మఠంపల్లి మండల అధ్యక్షుడు బిక్షం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఆర్ కృష్ణయ్యకు విన్నపం ఒక పోరాటం వినతి పత్రం

Satyam NEWS

స్పేస్ స్టేషన్ లో రష్యా మూవీ చిత్రీకరణ తొలి చిత్రంగా గణతి

Sub Editor

నిజాం కాలేజీ బాలికలకు ఎన్ఎస్యూఐ మద్దతు

Satyam NEWS

Leave a Comment