నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన హాస్టల్లో 100 శాతం బాలికలకు కేటాయించాలని గత 15 రోజులుగా కళాశాలలో విద్యార్థులు మౌన దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఈరోజు నిజాం కాలేజీ క్యాంపస్ లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అభిజిత్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీకర్, నిజం కాలేజ్ ఎన్ఎస్యూఐ నాయకులు సాయి నిఖిల్, యశ్వంత్, నవీన్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట