జానపద వాగ్గేయ కారుల, రచయితల, పాటల పండగగా ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్టివల్ 2022 జయప్రదం చేయాలని తెలంగాణ సాహితి ఖమ్మం కన్వీనర్ పోతగాని సత్యనారాయణ పిలుపిచ్చారు. స్థానిక మంచికంటి భవన్ లో. “లిటరరీ ఫెస్టివల్2022” బ్రోచరు ఆవిష్కరణ సమావేశంలో తెలంగాణ రైతుసంఘం నేత నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ సాహితి ఖమ్మం కన్వీనర్ పోతగాని సత్యనారాయణ, తెలంగాణ సాహితి బాధ్యులు డా.కటుకోఝ్వల రమేష్, కంచర్ల శ్రీనివాస్, కపిల రాంకుమార్, స్వేచ్ఛ టి.వి. ప్రయోక్త గోపాలకృష్ణ, నందిఅవార్డ్ గ్రహీత దేవేంద్ర, చంద్రకళా రామారావునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగను విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేశారు.
previous post