చల్లని నీడ నిచ్చే తెలుగుదేశం పార్టీ నుంచి పాము పడగ నీడకు చేరుతున్న వారు మరొక్క మారు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కోరారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అని, వైసీపీ అనేది ఒక ముఠా నాయకుడు నడిపే పార్టీ అని గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.
రాజకీయ పార్టీలో అందరికి అవకాశాలు వస్తాయి కానీ ముఠా నాయకుడి పార్టీలో కొందరికే అవకాశాలు వస్తాయని, ఇంత కాలం తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛగా బతికిన వారు వైసిపీలో ఉండలేరని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు కేసుల భయంతోనో, వారసుల కోసమో పార్టీ మారితే రాబోయే తరాలు క్షమించవని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉంటుందని, వైసీపీ 9 నెలల పాలనలో ఏ జరిగిందో అందరికి తెలుసునని ఆమె అన్నారు. పాలన గాలికి వదిలేసి కేవలం ముఠా రాజకీయాలకే పరిమితం అయిన వైసీపీ దీర్ఘ కాలిక రాజకీయం చేయలేదని ఆమె తెలిపారు. ఎప్పటికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యమే గెలుస్తుందని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. పార్టీ మారుతున్న నాయకులకు ఎలాంటి భవిష్యత్తు ఉండదని, అక్కడ ఇప్పటికే ఉన్న నాయకులకు ఊడిగం చేయాల్సిందేనని కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.
పవన్ గురించి నిజమే చెప్పా: రేణూ దేశాయ్