ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విపక్ష పార్టీల అభ్యర్థులపట్ల అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు సరిగా లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితులు చూస్తుంటే జగన్కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లినట్లు అనిపిస్తోందన్నారు.
previous post