27.7 C
Hyderabad
May 4, 2024 08: 49 AM
Slider పశ్చిమగోదావరి

నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

#TDP

దేశాన్నికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు.

నరసాపురం పార్లమెంట్  పరిధిలోని 7 నియోజకవర్గాలలో తెలుగు రైతు అధ్యక్షులను నేడు నియమించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యల పట్ల తెలుగు రైతు సంఘం అధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.

వారి సమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీకి రైతులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ధాన్యం అమ్ముకొన్న రైతులకు రెండు నెలలు గడుస్తున్న నేటికి వారి ఖాతాల్లోకి డబ్బులు జమచేయకుండా ప్రభుత్వము కాలయాపన చేస్తుందన్నారు

వెంటనే రైతుల బాకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసారు. పదవులు పొందిన నాయకులు పదవిని అలంకార ప్రాయంగా కాకుండా బాధ్యతగా  తీసుకొని పనిచేసి ఇచ్చిన పదవికి గౌరవం తేవాలన్నారు.

Related posts

ప్రధాని మోడీ ఆరోగ్యం కోసం రుద్ర హోమం

Satyam NEWS

అధికారులు వేధిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్ ధర్నా

Satyam NEWS

హైదరాబాద్ లో రేపు మాంసం దుకాణాలు బంద్

Satyam NEWS

Leave a Comment