ములుగు జిల్లా కేంద్రంలో ని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కొండపాక నారాయాణాచార్యులు, పొడిచేటి శేషాచార్యులు వేదమంత్రోచ్చారణల తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేన పూజ, పున్యాహవచనం, అభిషేకం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్, డా. సుతారి సతీష్, కొత్తపల్లి బాబూరావు, సలుపాల శ్రీను, తోట తిరుపతి, దుబాసి రమేష్, గుండేవేన రమేష్, శీలం వేణు, ఒజ్జల లింగన్న, బైకని సాగర్, కాపిడి ప్రభాకర్, గందం విజేందర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
next post