కడప జిల్లా రాజంపేటలో ఉన్న కొన్ని డివిజనల్ కార్యాలయాలను రాయచోటి మార్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడం దిక్కుమాలిన చర్య అంటూ రాజంపేట జిల్లా సాధన సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజంపేట అటవీశాఖ డివిజనల్ కార్యాలయం రాయచోటి కి తరలింపునకు నిరసనగా గురువారం రాజంపేట ప్రజలు మరియు జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా వచ్చి అటవీశాఖ కార్యాలయం ముందు బైఠాయించి రాజంపేట కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జిల్లా కేంద్రాల తుది నోటిఫికేషన్ రాకముందే రాయచోటిలో కార్యాలయాల ఏర్పాటు జరుగుతోందని ,వేల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఎలా చేస్తారని ,అదేకాకుండా రాజంపేట నుండి డివిజనల్ కార్యాలయాలను రాయచోటి కి తరలించాలని అనుకోవడం కక్ష సాధింపుకు నిదర్శన మన్నారు .రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటారా రాజంపేట కు ఎలాంటి గుర్తింపు లేకుండా చేస్తామని పగ బట్టారన్నారు.
previous post