వికలాంగుడైన దళితుడిని చెప్పుతో కొట్టిన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బజాకుంట గ్రామం మహిళా సర్పంచ్ సరిత పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధికార ప్రతినిధి డీకే మాదిగ డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న, ఇంకా అంటారానితనం పోలేదంటే, మనం ఏ కాలంలో ఉన్నాము అన్న సంగతి అందరూ ఆలోచించాలని ఆయన కోరారు. ఇలాగే అధికార దాహంతో ఎవరైనా ఎంతటి వారైనా దళితులపై చేయి చేసుకుంటే మాకంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందని మరిచిపోకండి అని ఆయన అన్నారు. సరిత బేషరతుగా దళితుడికి క్షమాపణ చెప్పే వరకు నల్లగొండ జిల్లాలో ఉన్న యావత్ దళిత జాతి బిడ్డలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.
previous post