26.7 C
Hyderabad
May 15, 2024 07: 46 AM
Slider మహబూబ్ నగర్

ఆర్థిక సహాయనికి గడువు పెంచాలి

#Congress

బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం పై గడువు పెంచాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పై గడువును పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాలలో కులము ఆదాయము ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.

మంగళవారం చివరి రోజు తో దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయబడుతుందని ఆందోళన చేస్తున్న బీసీ వర్గాల అందరికీ ఈ పథకం చేరాలనే ఉద్దేశంతో గడువును పొడిగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యక్షులు సైదులు యాదవ్ గణేష్ యాదవ్ నాయకులు నాని యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ హరీఫ్ శివ తదితరులు పాల్గొన్నారు

Related posts

ముమ్మరంగా సహాయ చర్యలు: అమర్ నాథ్ యాత్ర మళ్లీ ఎప్పుడో…?

Satyam NEWS

హోమియో చికిత్స: కరోనా ‘ థర్డ్ వేవ్ ‘ థండర్

Satyam NEWS

ప్రజల పన్నులను, ఆస్తులను దోచుకుంటున్న ఎమ్మెల్యే ద్వారంపూడి

Satyam NEWS

Leave a Comment