37.2 C
Hyderabad
May 2, 2024 13: 13 PM
Slider మహబూబ్ నగర్

కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు

#UNESCO

తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించే హెరిటేజ్ సైట్ లు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక పురావస్తు కట్టడాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. నారాయణపేట జిల్లా లోని ముడుమల్ లో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కు కృషి చేస్తున్నాము.

ముదుమాల్ లో ఉన్న పురాతన చారిత్రక గుర్తింపు ఉన్న అంతరిక్ష, వాతావరణ మార్పుల కేంద్రం కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు జాబితాకు పంపేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ పరిరక్షణ సాంకేతిక సహకారం పై తెలంగాణ హెరిటేజ్ శాఖ దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టుల మధ్య అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అందచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఎంతో పురాతన చరిత్ర, కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపద ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తింపు లభించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పురాతన చరిత్ర, చారిత్రక వారసత్వ సంపద గా యూనేస్కో గుర్తింపు పొందడానికి ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక పురావస్తు కట్టడాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు.

యునెస్కో గుర్తింపు కోసం నారాయణ పేట లో ఉన్న ముడుమాల్ పురావస్తు కేంద్రం అదిమనవుని కాలం నుండి అంతరిక్ష పరిశోధన, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ చారిత్రక కేంద్రం కు ఎంతో పేరు ఉందని చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్రం లో ఉన్నా చరిత్ర, వారసత్వ సంపద, కట్టడాలు చరిత్రా వెలికితీయడానికి, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు కోసం విశేష కృషి చేస్తున్నామన్నారు.

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ పరిరక్షణకు, సాంకేతిక సహాయం అందించడం కోసం తెలంగాణ హెరిటేజ్ శాఖ – దక్కన్ హెరిటేజ్ అకాడమి ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ ల మధ్య MOU జరుపుకోవడం జరిగింది. ఈ సంధర్బంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఒప్పింద పత్రాలను డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్, హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్ ప్రొఫెసర్ K P రావు లు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం

Satyam NEWS

సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలి

Bhavani

ఎంతటి వారికైనా విద్యాబుద్ధులు నేర్పేది గురువే

Satyam NEWS

Leave a Comment