దేశ వ్యాప్తంగా 400 థియేటర్లలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై నేడు దేశ వ్యాప్తంగా 4,000కు పైగా థియేటర్లకు పెరిగిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలోకి రాబోతున్నది. ముఖ్యంగా దక్షిణాది భాషలు అన్నింటిలో ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం రూ. 100కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా హింసించబడ్డారు? ఎలా చంపబడ్డారు? వాళ్ళు స్వదేశం నుంచి బలవంతగా ఎలా బయటకు పంపబడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
రూ 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ 350 కోట్లకు పైగా వసూలు చేసిన్నట్లు చెబుతున్నారు. ‘హేట్స్టోరీ’, ‘ద తాష్కెంట్ ఫైల్స్’ చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమా తీశారు. దీనికోసం ఆయన నాలుగేళ్లపాటు విస్తృతంగా పనిచేశారు. నాడు కాశ్మీర్ నుంచి వలస వచ్చిన తొలితరం పండిట్లను ఇంటర్వ్యూ చేశారు.