ఈ నెల 29, 29 న దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెకు మద్దతు తెలియచేయాలని ఏపీలోని విజయనగరలోని పట్టణ పౌరసంక్షేమసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది.
ఈ సదస్సు ను ఉద్దేశించి పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం టాటా స్టీల్ కంపెనీ కి అమ్మేందుకు సిద్ధమౌతున్నారన్నారు..ఎల్ఐసీ, బ్యాంక్ లు.. ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ కి వ్యతిరే కంగా … రైతు చట్టాలు అమలు చేయాలని.. అసంగటి త రంగ సమస్యలు పరిష్కా రం కై దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చిందన్నారు.
ఇందులో భాగంగా ఇంటి పని..వంటపని కార్మికులంతా పాల్గొనాలని రెడ్డి శంకరరావు పిలుపు నిచ్చారు.. ఇంటి పని.. వంట…పని.. కార్మికులకు చట్ట పరమైన హక్కులు అమలుకోసం పోరాడాలని… పోరాటాల తో నే ఇంతవరకు కార్మిక వర్గం సాధించుకున్నారు అని ఆయన గుర్తు చేశారు.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం ప్రధాని మోడీ ప్రజా ధనాన్ని.. ప్రభుత్వ ఆస్తులు అపచెప్పే స్తున్నారని.. దీన్ని 28,29 సమ్మె ద్వారా నిలువరిస్తామని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం మనమంతా నడుం కట్టాలి అన్నారు. ప్రసాద్ అధ్యక్ష త వహించిన ఈ సదస్సు లో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి. రమణమ్మ ,సీఐటీయూ నగర అధ్యక్షుడు… వంట కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. రమణ, రాజు.. పైడి శెట్టి లు పాల్గొన్నారు.