37.2 C
Hyderabad
May 6, 2024 12: 46 PM
Slider ఖమ్మం

మరణించిన పోలీసుల కుటుంబాలకు చెక్కులను అందజేసిన ఎస్పీ

#spktdm

ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వీరభద్రం  కుటుంబానికి 26,00,000/-ల రూపాయల చెక్కును,అదేవిధంగా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన శ్యామ్ సన్  కుటుంబానికి చేయూత ఫండ్ 1,00,000/-ల రూపాయల చెక్కును,మణుగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన హెడ్ కానిస్టేబుల్ రవీందర్  కుటుంబానికి కార్పస్ ఫండ్ 60,000/-ల రూపాయల నగదు చెక్కులను ఎస్పీ డా.వినీత్ ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ నిరంతరం విధులలో నిమగ్నమై ఉండే పోలీస్ అధికారులు,సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫేక్ వార్నింగ్ :బాంబులు ఉన్నాయి ఏ క్షణమైనా పేల్చేస్తా

Satyam NEWS

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

Satyam NEWS

కూరగాయలు పంచిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

Satyam NEWS

Leave a Comment