ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వీరభద్రం కుటుంబానికి 26,00,000/-ల రూపాయల చెక్కును,అదేవిధంగా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన శ్యామ్ సన్ కుటుంబానికి చేయూత ఫండ్ 1,00,000/-ల రూపాయల చెక్కును,మణుగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మరణించిన హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కుటుంబానికి కార్పస్ ఫండ్ 60,000/-ల రూపాయల నగదు చెక్కులను ఎస్పీ డా.వినీత్ ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం విధులలో నిమగ్నమై ఉండే పోలీస్ అధికారులు,సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post