నిజామాబాద్ జిల్లాలో అక్క చెల్లెలు మర్డర్ కలకలం రేపింది. ఆర్మూర్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వీరు మగ్గిడి గంగవ్వ, (69) మగ్గిడి రాజవ్వ( 72) గా గుర్తించారు చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన స్థానికులు అక్కడి చేరుకొనే సరికి దుండగులు పారిపోయారు, పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.