28.7 C
Hyderabad
April 26, 2024 09: 05 AM
Slider కృష్ణ

హ్యాట్సాఫ్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి

#MLCRajendraPrasad

తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని  17 వ వార్డు లో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ విచ్చేశారు.

ఆయన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ వలన మానవ మనుగడ అత్యంత ఇబ్బంది గా మారినా, క్లిష్ట పరిస్థితుల్లో  ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయ్యడం గొప్ప విషయం అని అన్నారు.

ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర సరుకుల ను రాజేంద్రప్రసాద్ అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరేపల్లి సుబ్బారావు, రాజులపాటి ఫణికుమార్,చలపాటి శ్రీనివాసరావుజంపాన తేజ,మరియు హనుమాన్ నగర్ యువత,కాటూరు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.

Related posts

గణపసముద్రం చెరువులో మంచినీటి రొయ్యల విడుదల

Satyam NEWS

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

Satyam NEWS

Digital disaster of Dharani portal

Satyam NEWS

Leave a Comment