తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని 17 వ వార్డు లో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అదితి గా ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ విచ్చేశారు.
ఆయన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ వలన మానవ మనుగడ అత్యంత ఇబ్బంది గా మారినా, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు, సమాజానికి సేవ చేయ్యడం గొప్ప విషయం అని అన్నారు.
ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర సరుకుల ను రాజేంద్రప్రసాద్ అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరేపల్లి సుబ్బారావు, రాజులపాటి ఫణికుమార్,చలపాటి శ్రీనివాసరావుజంపాన తేజ,మరియు హనుమాన్ నగర్ యువత,కాటూరు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు.