వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. రేవల్లి మండలం నాగపూర్లో ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి శవాలు లభ్యమయ్యాయి.
అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట పడి ఉన్నాయి. ఆ దృశ్యాలను చూసి షాక్ తిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థా
నికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.వంట గదిలో అజీరాం బీ, హాల్లో హాసీనా, డైనింగ్ హాల్లో ఆస్మా బేగం, ఇంటి వెనక ఖాజా పాషా మృతదేహాలు పడిఉన్నాయి.