సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మండల స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతులను రైతు భీమా, ఇన్సూరెన్స్ ,రైతుబంధు, 24 గంటల కరెంటు, గ్రామాలలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, నర్సరీలు సమకూర్చి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎలాంటి సమస్య లేకుండా కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎం పి పి గూడెం శ్రీనివాస్, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీడీవో గంట వరప్రసాద్, ఎం పి ఓ మౌలానా, ఎంపిటిసిలు, సర్పంచులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.