అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి త్యాగాలను స్మరించుకుంటూ, సోమవారం ఐడిఓసి లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, జిల్లా అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ అమరులైన జనవరి 30 వ తారీకున అమరవీరుల దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకొని, వారి జీవితాలతో స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post