వద్దు రా వెళ్లద్దురా కరోనా టైమ్ లో రోడ్డు మీదుకు వెళ్లద్దురా అంటే వినలేదు. ఇప్పుడు చూడు బండి పోయి రోడ్డుమీద కూర్చుంది. అంటూ వాపోవాల్సి వస్తోంది కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు. లాక్ డౌన్ సమయంలో చట్ట విరుద్ధంగా రోడ్లపై సంచరిస్తున్న వారిని ఆపి చెక్ చేసి వారు చూపిన ఆధారాలు కరెక్టు కాదని భావిస్తే వారి వాహనాన్ని పోలీసులు సీజ్ చేస్తారు.
అలా హైదరాబాద్ కూకట్ పల్లిలో వందలాది వాహనాలను సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన వాహనాలను పోలీసులు రోడ్డుపైన ఒక వైపుగా పార్క్ చేసి ఇదుగో ఇలా బోర్డు పెట్టేశారు. ఇలా పెట్టినప్పటి నుంచి రోడ్డు పై వాహనాలు తగ్గాయని పోలీసులు అంటున్నారు. అందరు పోలీసులూ ఇలా డిస్ ప్లే చేస్తే వాహనాలపై తిరిగేందుకు చాలా మంది సిగ్గుపడి మానేస్తారు. గ్యారెంటీ.