రాజధానిని విశాఖకు మార్చే తొందరలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో కరోనా ప్రభావం పెద్దగా లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వాధికారులు సైతం వాస్తవాలు బయటపెట్టంలేదని అయ్యన్న అన్నారు.
రోజు రోజుకు కరోనా కేసులు విశాఖ నగరంలో విపరీతంగా పెరుగుతున్నాయని, అయితే ప్రభుత్వం విశాఖలో కేసులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కరోనా వైరస్ వ్యాప్తి వివరాలు దాస్తే ఉత్తరంధ్ర జిల్లాల ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.