రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా ని ఆమె స్నేహితురాలు, ప్రముఖ సినీ నటి రమ్య కృష్ణ మంగళవారం నగరి లోని ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తిరుగు ప్రయాణంలో నగరి లోని మంత్రి ఆర్.కె.రోజా స్వగృహంలో స్నేహపూర్వకంగా కలిశారు. ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ ని సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మునిసిపాలిటి, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post