39.2 C
Hyderabad
April 28, 2024 14: 22 PM
Slider కడప

కరోనా హెల్ప్: దళిత వాడల్లో బియ్యం బస్తాలు పంపిణీ

rajampet 181

కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వచ్ఛంద సేవకులు ఏ.బి. శివారెడ్డి నేడు 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాజీవ్ నగర్,హరిశ్చంద్ర నగర్, సాతుపల్లె లో శనివారం 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటూ, ఒక్కో కుటుంబంకు 25 కేజీల బియ్యం బస్తాలను ఆయన పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి మూలంగా లాక్ డౌన్ కర్ఫ్యూ తో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ వర్గాల వారు ఆహారం రూపంలోను, నిత్యావసర వస్తువుల రూపంలో అందిస్తున్నారు.

ఈ నేపద్యంలో స్వచ్ఛంద సేవకులు ఏ.బి. శివారెడ్డి స్వర్గీయ తల్లి దండ్రులు చెంగమ్మ, శేషారెడ్డి, సోదరుడు శివప్రసాద్ రెడ్డి ల పేరిట వారి జ్ఞాపకార్థం 300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నాణ్యమైన 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దీంతో పేద కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

ఖమ్మం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రజాదివాస్

Satyam NEWS

అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్

Bhavani

కొలువుదీరిన వేంకటేశ్వరుడు: గోవింద నామస్మరణతో మార్మోగిన దుబ్బాక

Satyam NEWS

Leave a Comment