కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వచ్ఛంద సేవకులు ఏ.బి. శివారెడ్డి నేడు 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాజీవ్ నగర్,హరిశ్చంద్ర నగర్, సాతుపల్లె లో శనివారం 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో పాటూ, ఒక్కో కుటుంబంకు 25 కేజీల బియ్యం బస్తాలను ఆయన పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారి మూలంగా లాక్ డౌన్ కర్ఫ్యూ తో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ వర్గాల వారు ఆహారం రూపంలోను, నిత్యావసర వస్తువుల రూపంలో అందిస్తున్నారు.
ఈ నేపద్యంలో స్వచ్ఛంద సేవకులు ఏ.బి. శివారెడ్డి స్వర్గీయ తల్లి దండ్రులు చెంగమ్మ, శేషారెడ్డి, సోదరుడు శివప్రసాద్ రెడ్డి ల పేరిట వారి జ్ఞాపకార్థం 300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి నాణ్యమైన 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దీంతో పేద కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేశారు.