అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అవకతవకలపై వార్త కథనం రాసిన ‘ నిఘా’ జాతీయ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ సతీష్ ముదిరాజ్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. అంబర్ పేట మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న నందిపల్లి అరవింద్ గౌడ్ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఆధారాలతో సహా నిఘా న్యూస్ వార్త కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆగ్రహించిన అరవింద్ గౌడ్ సోదరుడు బాగ్ అంబర్ పేట్ బురుజు గల్లికి చెందిన నందిపల్లి సంజీవ్ గౌడ్ ఆదివారం అయ్యప్ప దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న రిపోర్టర్ సతీష్ ముదిరాజ్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. నా సోదరుడు అరవింద్ గౌడ్ పై నీవు వార్త ఎలా రాస్తావా .. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ మాది… ఎవర్ని గ్రౌండ్ కు రానివ్వం అంటూ దౌర్జన్యానికి దిగాడు.ఈ బెదిరింపులపై స్టాఫ్ రిపోర్టర్ సతీష్ ముదిరాజ్ పోలీసులను, జర్నలిస్ట్ సంఘాలను ఆశ్రయించాడు.
next post